పవన్ హీరోయిన్ రీ ఎంట్రీ!
ABN , First Publish Date - 2022-01-20T22:04:38+05:30 IST
గుడుంబా శంకర్, భద్ర చిత్రాలతో పాపులర్ అయిన మలయాళ కుట్టీ మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. విరామ సమయంలో ఆమె అభిమానులకు అందుబాటులో ఉన్నదీ తక్కువే. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరచి సోషల్ మీడియాలోనూ అడుగుపెట్టారు.
'గుడుంబా శంకర్’, ‘భద్ర’ చిత్రాలతో పాపులర్ అయిన మలయాళ కుట్టీ మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. విరామ సమయంలో ఆమె అభిమానులకు అందుబాటులో ఉన్నదీ తక్కువే. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరచి సోషల్ మీడియాలోనూ అడుగుపెట్టారు. మాతృభాషలో ఆమె చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘‘కొత్త ప్రారంభాలను ఎప్పుడూ స్వాగతిద్దాం. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ ఉన్నాం అనేది కాకుండా మనలో మార్పునకు కారణం ఏంటని ఆలోచించాలి. సినిమా పరిశ్రమకు, నా మనుషులకు దగ్గర కావడానికి చేస్తున్న మరో ప్రయత్నమిది. ఈ స్టెప్ తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.