‘నరనరమూ’.. హుషారెక్కించే పాటతో మాల్గాడి శుభ రీ ఎంట్రీ
ABN , First Publish Date - 2022-01-29T01:32:34+05:30 IST
‘నర నరమూ’ అంటూ హుషారెక్కించే పాటతో సింగర్ మాల్గాడి శుభ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం

‘నర నరమూ’ అంటూ హుషారెక్కించే పాటతో సింగర్ మాల్గాడి శుభ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఈ చిత్రంలోని శ్రీయా గోషల్ పాడిన ‘పో పోవే...’ అనే పాట కూడా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా చిత్రంలోని మరో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.
డిఫరెంట్ సాంగ్స్కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాటను ఆలపించారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఈ పాటతో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘నర నరమూ’ అంటూ ఆమె పాడిన ఈ పాటను రాంబాబు గోశాల రచించగా.. వినోద్ యాజమాన్య స్వరపరిచారు. ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలుపుతున్నారు.