Major: సెన్సార్ పూర్తి
ABN , First Publish Date - 2022-05-25T14:04:35+05:30 IST
'మేజర్' (Major) సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా 2008లో జరిగిన ముంబై ఉగ్ర దాడిలో ప్రజలను కాపాడటానికి ప్రాణాలను పణంగా
'మేజర్' (Major) సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా 2008లో జరిగిన ముంబై ఉగ్ర దాడిలో ప్రజలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహిస్తున్నారు. 'క్షణం' (Kshanam), 'ఎవరు' (Evaru), 'గూఢచారి' (Goodachari) వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న శేష్కు కథ స్క్రీన్ ప్లే మీద కూడా మంచి పట్టుంది. మల్టీ టాలెంటెడ్ కావడంతో చిత్ర నిర్మాతలలో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమా బాధ్యలను ఎక్కువగా శేష్కే అప్పగించారు.
ఈ సినిమాను జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేజర్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ను పొందింది. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ను సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రశంసిచినట్లుగా చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, ఈ సినిమా చివరిలో సెన్సార్ బోర్డు సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సందీప్ ఉన్నికృష్ణన్కు సెల్యూట్ చేశారట. అనంతరం సెన్సార్ బోర్డ్ సభ్యులు అడివి శేష్ యాక్టింగ్కు ప్రత్యేక అభినందనులు తెలిపారని సమాచారం.
కాగా, ఈ సినిమాను జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తుండగా.. ఇందులో హీరోయిన్గా సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో శోభిత ధూళిపాళ నటించారు. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో విడుదలవబోతుంది.