Mahesh Babu: గంగలో కలిపిన అమ్మ అస్థికలు
ABN , First Publish Date - 2022-10-03T17:38:14+05:30 IST
మహేష్ బాబు (Mahesh Babu) తన మాతృమూర్తి అయిన ఇందిరాదేవి (Mahesh's mother Indira Devi) అస్థికలను (Ashes) గంగలో (The Ganges) కలిపాడు.
మహేష్ బాబు (Mahesh Babu) తన మాతృమూర్తి అయిన ఇందిరాదేవి (Mahesh's mother Indira Devi) అస్థికలను (Ashes) గంగలో (The Ganges) కలిపాడు. అలాగే చెయ్యాల్సిన కర్మలు (Karma) అన్నీ శ్రద్ధతో చేస్తున్నాడు. ఇంటి దగ్గర చిన్న కర్మ అయిపోయాక, మహేష్ బాబు హరిద్వార్ (Haridwaar) వెళ్లి గంగలో (Ganga) తన తల్లి (Mother) అస్థికలను (Merges into the Ganges) కలిపాడని తెలిసింది. నిన్న ఆదివారం మహేష్ మరియు మరికొంతమంది అతని కుటుంబ సభ్యులు హరిద్వార్ వెళ్లిన వారిలో వున్నారని తెలిసింది. గల్లా జయదేవ్ (Galla Jayadev), సుధీర్ బాబు (Sudheer Babu), ఆదిశేషగిరి రావు (Aadiseshagiri Rao), ఇంకా మరొక పది మంది సభ్యులు వెళ్లినట్టుగా తెలిసింది.
బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ (Special aircraft) మాట్లాడుకొని, ఉదయం బయలుదేరినట్టుగా తెలిసింది. హరిద్వార్ లో చెయ్యాల్సిన కర్మలు అన్నీ చేసి, అస్థికలను గంగలో కలిపి, మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మాత్రం హైదరాబాద్ లో ఉండిపోయారు, అతను వెళ్ళలేదు. అతనికి ఆర్యోగం సరిగ్గా సహకరించక వెళ్లలేదని తెలిసింది. తల్లి దశ దిన కర్మలు కూడా చాల శ్రద్ధతో చెయ్యాలని మహేష్ అనుకుంటున్నారు. మరి ఆ పెద్ద కర్మ హైదరాబాద్ లో చేస్తారా, లేక వేరే దగ్గర ఏమయినా చేస్తారా అన్నది ఇంకా సరి అయినా సమాచారం లేదు. కొందరు సొంతవూరు బుర్రిపాలెం లో అయితే బాగుంటుంది అని కూడా చెప్పినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత ఆ దశ దిన కర్మ ఎక్కడ చేయాలన్నది నిర్ణయిస్తారని తెలిసింది.