బుధవారం బిల్గేట్స్తో...
ABN , First Publish Date - 2022-06-30T05:58:10+05:30 IST
మహేశ్బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్త బిల్గేట్స్ను కలిశారు.
మహేశ్బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్త బిల్గేట్స్ను కలిశారు. సరదాగా గడిపేందుకు మహేశ్బాబు కుటుంబంతో ఇటీవలె న్యూయార్క్ వెళ్లారు. బుధవారం బిల్గేట్స్ను కలసి కొద్దిసేపు ముచ్చటించారు. ‘గొప్ప దార్శనికుడు, మంచి మనిషి, అందరికీ స్ఫూర్తి... బిల్గేట్స్. ఆయన్ను కలవడం ఆనందంగా ఉంద’ని మహేశ్ పేర్కొన్నారు. ఫొటోలను మహేశ్బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్బాబు ఓ చిత్రం చేస్తున్నారు.