Liger Promo: పొరపాటున సినిమా బాలేదు, జనాలు రాలేదు అంటే..? ఛార్మీ కామెంట్స్ వైరల్..!
ABN , First Publish Date - 2022-08-18T18:23:15+05:30 IST
‘పొరపాటున సినిమా బాలేదు, జనాలు రాలేదు అంటే’..అని తాజాగా వదిలిన ‘లైగర్’ (Liger) ఇంటర్వ్యూకి సందించిన ప్రోమోలో ఛార్మీ (Charmi) అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పొరపాటున సినిమా బాలేదు, జనాలు రాలేదు అంటే’..అని తాజాగా వదిలిన ‘లైగర్’ (Liger) ఇంటర్వ్యూకి సందించిన ప్రోమోలో ఛార్మీ (Charmi) అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) రూపొందించిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నాన్ స్టాప్గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ ఎక్స్క్లూజివ్ ఇంటరెవ్యూ కూడా నిర్వహించారు.
ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆగస్టు 19వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుండగా, ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ ప్రోమో ఎంతో ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)లను ఇంటర్వ్యూ చేసిన ఛార్మీ..ఈ సందర్భంగా అడిగిన కొన్ని ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
నేనిప్పుడు ఛార్మీ కాదు.. కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను.. అంటూ మొదలైన ప్రోమోలో..
ఇంకొక ట్రైలర్ వస్తుందా..? అసలు కథ తెలియడం లేదు,
మైక్ టైసన్ని చాలా బ్రూటల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలా సరదాగా చూపించారు.
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా?
బడ్జెట్ పెరిగింది..కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. బాక్సాఫీస్ నుంచి ఎలాంటి నంబర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..?
పొరపాటున జనాలు రాలేదు, సినిమా బాలేదు అని వచ్చిందంటే..?
లాక్డౌన్లో డబ్బు లేదు..ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది..జేబులో ఒక్క రూపాయి లేకపోయినా అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి..!
ఇలా ఛార్మీ ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నలే ఇప్పుడు మూవీపై అంచనాలను ఇంకా పెంచాయి. అంతేకాదు, ఫుల్ ఇంటర్వ్యూ కోసం కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛార్మీ అడిగిన ప్రశ్నలకు పూరి, విజయ్ ఏమని సమాధానమిచ్చారు..అని ఆతృతగా ఉన్నారు. చూడాలి మరి ఫుల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లైగర్ మూవీపై అంచనాలు ఏ స్థాయికి చేరుకుంటాయో. కాగా, అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మించాయి.