ఆకట్టుకుంటున్న ‘లైగర్’ సైకత శిల్పం

ABN , First Publish Date - 2022-01-24T22:29:22+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. ఇందులో విజయ్ బాక్సర్ గా అదరగొట్టబోతున్నాడు. ఆ పాత్రకోసం చాలా కష్టపడుతున్నాడు. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తుండగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మొన్నామధ్య విడుదలైన ‘లైగర్’ టీజర్ అంచనాల్ని పెంచేసింది.

ఆకట్టుకుంటున్న ‘లైగర్’ సైకత శిల్పం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. ఇందులో విజయ్ బాక్సర్ గా అదరగొట్టబోతున్నాడు. ఆ పాత్రకోసం చాలా కష్టపడుతున్నాడు.  సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తుండగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మొన్నామధ్య విడుదలైన ‘లైగర్’ టీజర్ అంచనాల్ని పెంచేసింది.  


తాజాగా ప్రముఖ ఒరిస్సా సైకత శిల్పి దశరథ మొహంతా ఒరిస్సాలోని ఒక ప్రాంతంలో ‘లైగర్’ పోస్టర్ శాండ్ ఆర్ట్ ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నాడు. విజయ్, మైక్ టైసన్, విజయ్ ముఖాల్ని ఇసుకతో చెక్కి విజయ్ అభిమానుల్ని ఫిదా చేసేశాడు. ప్రస్తుతం ఈ ఆర్ట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ‘లైగర్’ విడుదల కాబోతోంది. 



Updated Date - 2022-01-24T22:29:22+05:30 IST