సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లెహరాయి.. పాటలు అదిరాయి

ABN, First Publish Date - 2022-06-18T05:30:00+05:30

రంజిత్‌, సౌమ్య మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లెహరాయి’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంజిత్‌, సౌమ్య మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన  ‘లెహరాయి’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. రామకృష్ణ పరమహంసను దర్శకుడిగా పరిచయం చేస్తూ  మద్దిరెడ్డి శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘మెరుపై మెరిసావే.. వరమై కలిశావే’ను దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా విడుదల శుక్రవారం విడుదల చేశారు. సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఈ పాట పాడారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ సార్ట్‌ చేశారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ ‘సిద్‌ శ్రీరామ్‌ పాట పాడితే చాలు చార్ట్‌బస్టర్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్‌లోకి వెళుతుంది. క్యాచీ లిరిక్‌తో హమ్మింగ్‌ ట్యూన్‌తో పాట చాలా బాగుంది’ అని అభినందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్‌ చెప్పారు. సినిమాలో ఏడు పాటలు ఉన్నాయనీ, ప్రతి పాటా అలరిస్తుందని దర్శకుడు రామకృష్ణ పరమహంస తెలిపారు. మంచి ఫీల్‌ ఉన్న కథతో సినిమా రూపుదిద్దుకుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-06-18T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!