KGF 2 : సెన్సార్ పూర్తి

ABN , First Publish Date - 2022-04-08T18:14:27+05:30 IST

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే.. బాలీవుడ్ సినియర్ హీరోయిన్ రవీనాటండన్ కీలక పాత్ర చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై.. అభిమానుల్ని ఖుషీ చేసింది. దీనికి యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కాయి.

KGF 2 : సెన్సార్ పూర్తి

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే.. బాలీవుడ్ సినియర్ హీరోయిన్ రవీనాటండన్ కీలక పాత్ర చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై.. అభిమానుల్ని ఖుషీ చేసింది. దీనికి యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కాయి.  ఇక ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా రన్ టైమ్ ను 168 నిమిషాలకు సెట్ చేశారు. అంటే 2 గంటల 48 నిమిషాలు.


ఇక ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్..  ఏప్రిల్ 7 న అంటే.. సినిమా విడుదలకు వారం రోజులు ముందుగానే ఓపెన్ అయింది. ‘కేజీఎఫ్’ మొదటి భాగం  సెన్సేషనల్ హిట్ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకి ఏ మాత్రం దక్కని రీతిలోనే అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-04-08T18:14:27+05:30 IST