Keerthi Suresh : ఆశలన్నీ ‘సర్కారువారి పాట’ చిత్రంపైనే !

ABN , First Publish Date - 2022-05-08T15:49:12+05:30 IST

‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthi Suresh). తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అమ్మడు. ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’ చిత్రం కూడా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. చూడ్డానికి క్యూట్ గా ఉందని, అందుకు తగ్గట్టుగానే సాఫ్ట్ అండ్ కూల్ కథల్ని సెలెక్ట్ చేసుకుంటుందని భావించారు అందరూ.

Keerthi Suresh : ఆశలన్నీ ‘సర్కారువారి పాట’ చిత్రంపైనే  !

‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthi Suresh). తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అమ్మడు. ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’ చిత్రం కూడా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. చూడ్డానికి క్యూట్ గా ఉందని, అందుకు తగ్గట్టుగానే సాఫ్ట్ అండ్ కూల్ కథల్ని సెలెక్ట్ చేసుకుంటుందని భావించారు అందరూ. అయితే అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ‘మహానటి’ (Mahanati) లాంటి సినిమాతో తన నట విశ్వ,రూపాన్ని ప్రదర్శించి షాకిచ్చింది. ఈ సినిమాకు గాను ఆమె నేషనల్ అవార్డ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేశ్ (Keerthi Suresh) తెలుగులో ఎంతో బిజీ అయిపోతుందని అనుకున్నారు. అయితే తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసి.. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.  


మళ్ళీ టాలీవుడ్‌లో నటించినప్పటికీ.. కీర్తి సురేశ్ (Keerthi Suresh) చేసినవన్నీ లేడీ ఓరియెంటెడ్ మూవీసే అవడం విశేషం. ఆ టైమ్ లోనే ఆమె బాగా సన్నబడింది. అదే లుక్ తో ఆమె నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి ఓటీటీ మూవీస్,  ‘గుడ్‌లక్ సఖి’ లాంటి థియేట్రికల్ మూవీ  అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. అలా తెలుగు ఆడియన్స్‌ను ఆ సినిమాలతో కీర్తి సురేశ్ ఎంతగానో నిరాశపరిచింది. తెలుగులో ఆమె పెద్ద హిట్ అందుకొని చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్న మహేశ్ బాబు (Mahesh babu ) ‘సర్కారువారి పాట’ చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది కీర్తి సురేశ్ (Keerthi Suresh). మహేశ్ సరసన కీర్తి మొట్టమొదటి సారిగా ఇందులో రొమాన్స్ చేయనుండడం విశేషం.


బ్యాంకింగ్ స్కామ్ (Banking scam) నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో పరశురామ్ దర్శకత్వంలో  ‘సర్కారువారి పాట’ చిత్రం తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్ , 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. ఇందులో కీర్తి సురేశ్ (Keerthi Suresh) పాత్రకు ఎంతో ప్రధాన్యముంటుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే... ఈ సినిమాలోని తమ లవ్ ట్రాక్ అభిమానుల్ని మెప్పిస్తుందని మహేశ్ బాబు సైతం ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. మరి కీర్తి సురేశ్  (Keerthi Suresh) ‘సర్కారువారి పాట’ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి. 

Updated Date - 2022-05-08T15:49:12+05:30 IST