జెంటిల్మెన్ కోసం.. కీరవాణి
ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్’ అప్పట్లో ఓ సంచలనం..
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్’ అప్పట్లో ఓ సంచలనం. ఈ చిత్రానికి కుంజుమన్ నిర్మాత. ఇప్పుడు ఆయన వేరే టీమ్తో ‘జెంటిల్మెన్ 2’ రూపొందిస్తున్నారు. అర్జున్ సర్జా, మధు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా కుంజుమన్ మాట్లాడుతూ ‘‘మా సినిమా కోసం పనిచేసే సంగీత దర్శకుడి పేరు ఊహించమంటూ ట్విట్టర్లో ఓ కాంటెస్ట్ నిర్వహించాం. చాలామంది కీరవాణి పేరు ఊహించారు. వాళ్లలో ముగ్గురిని ఎంపిక చేసి, త్వరలోనే మూడు బంగారు నాణాలను బహుమతిగా అందిస్తాం. లెజెండరీ సంగీత దర్శకుడైన కీరవాణిగారితో పనిచేయడం గర్వంగా ఉంద’’న్నారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.