సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR: తారక్‌కు సీఎం నుంచి ప్రత్యేక ఆహ్వానం!

ABN, First Publish Date - 2022-10-30T01:55:12+05:30

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నవంబర్‌ 1న కర్టాటక వెళ్లనున్నారు. అక్కడ విధానసౌధలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Jr ntr)కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (karnataka cm Basavaraj Bommai) నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నవంబర్‌ 1న కర్టాటక వెళ్లనున్నారు. అక్కడ విధానసౌధలో (Vidhana soudha)జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ (Kannada rajathotsava)వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ మెగాస్టార్‌ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో విశిష్ఠ పురస్కారంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డు అందుకోనున్న తొమ్మిదో వ్యక్తి పునీత్‌. కర్ణాటకలో కూడా ఎన్టీఆర్‌కు మంచి క్రేజ్‌ ఉంది. పునీత్‌తో తారక్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే! ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి ఈ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ  కార్యక్రమానికి రజనీకాంత్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి. 


Updated Date - 2022-10-30T01:55:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!