దర్శకేంద్రుడు వదిలిన ‘దర్జా’ సింగిల్
ABN , First Publish Date - 2022-04-04T20:56:38+05:30 IST
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తాజాగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చాలా రిచ్గా చిత్రీకరించారు. ఈ పాట చూస్తుంటే.. ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.
చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సాంగ్ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే ‘దర్జా’ విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.