పాన్ ఇండియా ‘జూనియర్’
ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST
గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా వారాహి చలన చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా వారాహి చలన చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రాధాకృష్ణ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం కిరీటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లిమ్స్ విడుదల చేశారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవిచంద్ర, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్.