Jeevitha: 25 ఏళ్లగా ఎంతో ఇబ్బందిపడుతున్నా!
ABN, First Publish Date - 2022-05-20T00:25:10+05:30
సోషల్ మీడియాలో తమపై వచ్చే కథనాలు, యూట్యూబ్ తంబ్నైల్స్ మరెవరిపైనా అంతగా ఉండవని నటి జీవితా రాజశేఖర్ అన్నారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆమె ఖండించారు. నా కుటుంబంపై వచ్చినని అసత్య వార్తలు మరెవరి మీద రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తమపై వచ్చే కథనాలు, యూట్యూబ్ తంబ్నైల్స్ మరెవరిపైనా అంతగా ఉండవని నటి జీవితా రాజశేఖర్ (Jeevitha rajashekar)అన్నారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆమె ఖండించారు. నా కుటుంబంపై వచ్చినని అసత్య వార్తలు మరెవరి మీద రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకీ ఓ కుటుంబం ఉందనీ, ఇలాంటి వార్తలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఆమె అన్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో జీవిత మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు(Adi seshagiri rao), తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ‘‘విడుదలకు సిద్ధంగా ఉన్న ‘శేఖర్’(Shekar) సినిమా ప్రమోషన్లో నా కూతురుతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో ఓ నానుడి చెప్పాను. దాన్ని వేరేలా అర్థం చేసుకుని ఆర్యవైశ్య వర్గం వారిని కించపరిచినట్లు వార్తలు సృష్టించి, చర్చా, సమావేశం కూడా పెట్టారు. ఎవరినీ కించపరచే ఉద్దేశం నాకు లేదు. నేను అలాంటి వాటికి దూరంగా ఉంటా. నా మాటలు ఎవరినైనా బాధపెడితే క్షమించండి’’ అని జీవిత అన్నారు.
నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టండి..
‘‘ఈ మధ్యన నా కూతుళ్లపై ఏవేవో వార్తలు రాశారు. నా కుమార్తె పర్సనల్ లైఫ్ను ఇబ్బంది పెట్టే తంబ్నైల్స్ పెట్టి వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటి వార్తలు నన్నే కాదు చాలామందిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కొన్ని మీడియా హౌస్లే ఇలా చేస్తున్నాయి. తప్పు చేశామో లేదో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. తప్పు చేశామని రుజువైతే నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండి. ఇలాంటి వార్తలతో 25 ఏళ్లగా ఎంతో ఇబ్బందిపడుతున్నా. దీనిపై లీగల్గా పోరాటం చేయొచ్చు. అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండదు. మాకూ బాధ్యతలు ఉన్నాయి. దయచేసి, మా బాధల్ని అర్థం చేసుకోండి’’ అని జీవిత (Jeevitha) అన్నారు.