Vishwaksen జోడీగా యాక్షన్కింగ్ తనయ
ABN, First Publish Date - 2022-05-18T19:08:38+05:30
కమల్హాసన్ (KamalHasan), శరత్కుమార్ (Sharathkumar) లాంటి హీరోల కూతుళ్ళు కథానాయికలుగా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలోకి చేరిన మరో నటవారసురాలు యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) గారాల తనయ ఐశ్వర్య (Ishwarya) కూడా వచ్చి చేరింది.
కమల్హాసన్ (KamalHasan), శరత్కుమార్ (Sharathkumar) లాంటి హీరోల కూతుళ్ళు కథానాయికలుగా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలోకి యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) గారాల తనయ ఐశ్వర్య (Ishwarya) కూడా వచ్చి చేరింది. నిజానికి ఆమె కోలీవుడ్లో కథానాయికగా ఎప్పుడో ఎంటర్ అయింది. విశాల్ హీరోగా నటించిన ‘పట్టత్తు యానై’ (Pattathu Yanai) చిత్రంతో ఆమె కోలీవుడ్లో తెరంగేట్రం చేసింది. తెలుగులో ఈ సినిమా ‘ధీరుడు’ (Dheerudu) గా విడుదలైంది. సినిమా బాగానే సక్సెస్ అయినప్పటికీ.. ఐశ్వర్యా అర్జున్కు అంతగా గుర్తింపు రాలేదు. అలాగే.. అర్జున్ ఆమెను కన్నడలో కూడా కథానాయికగా పరిచయం చేశాడు. తన దర్శకత్వంలోని సినిమాతోనే అర్జున్ ఆమెకు కన్నడ ఎంట్రీ ఇప్పించాడు. అయితే ఆ సినిమాతో కూడా ఆమెకు అంతగా పేరు రాలేదు.
ఇప్పుడు టాలీవుడ్లో ఐశ్వర్యను పరిచయం చేసేందుకు అర్జున్ (Arjun) ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి స్ర్కిప్ట్ కూడా రెడీ అయింది. అర్జున్ కు కథాకథనాలపై మంచి పట్టుంది. అలాగే దర్శకత్వంలోనూ, నిర్మాణంలోనూ మంచి అనుభవముంది. అందుకే ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ఐశ్వర్య (Ishwarya) ఎంట్రీ తెలుగు మూవీలో విశ్వక్సేన్ (Vishwaksen) ను కథానాయకుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. విశ్వక్సేన్ ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashokavanamlo Arjunakalhyanam) 'సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. దీని తర్వాత మరో రెండు సినిమాల్లో నటించబోతున్నాడు. వీటితో పాటు అర్జున్ దర్శకత్వంలోని చిత్రానికి కూడా కమిట్ కానుండడం విశేషం. మరి ఐశ్వర్యా అర్జున్ టాలీవుడ్ లోనైనా హీరోయిన్ గా క్లిక్ అవుతుందేమో చూడాలి.