ఆ నింద మోయాల్సిందే : కీర్తి సురేశ్
ABN , First Publish Date - 2022-01-29T23:28:30+05:30 IST
సినిమా ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగిన ప్రతి కథానాయిక మొదట ‘ఐరెన్ లెగ్’ అనే నింద మోయాల్సిందే. తొలి చిత్రంతో సక్సెస్ అందుకున్న కొద్ది మంది కథానాయికలకు మాత్రమే ఆ నింద తప్పుతుంది. టాలీవుడ్లో స్టార్లుగా వెలుగుతున్న చాలామంది దానిని దాటుకుని వచ్చిన వారే! ఇదే విషయంపై తాజాగా కీర్తి సురేశ్ స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగిన ప్రతి కథానాయిక మొదట ‘ఐరెన్ లెగ్’ అనే నింద మోయాల్సిందే. తొలి చిత్రంతో సక్సెస్ అందుకున్న కొద్ది మంది కథానాయికలకు మాత్రమే ఆ నింద తప్పుతుంది. టాలీవుడ్లో స్టార్లుగా వెలుగుతున్న చాలామంది దానిని దాటుకుని వచ్చిన వారే! ఇదే విషయంపై తాజాగా కీర్తి సురేశ్ స్పందించారు. ‘‘ఓ కొత్త కథానాయిక తెరపై కనిపించింది అంటే.. తొలి ఫలితాన్ని బట్టి ఓ ముద్ర పడుతుంది. సినిమా సక్సెస్ అయితే అంతా బాగానే ఉంటుంది. పొరపాటున మొదటి సినిమా ఫెయిల్ అయిందంటే.. సక్సెస్ చూసే వరకూ నిందలు మోయాల్సిందే! ఐరన్లెగ్ అనే ముద్ర వేసుకు తిరగాల్సిందే! అందుకు నేనేమీ మినహాయింపు కాదు. నేనూ ఆ నిందలు మోశాను. ఓ మలయాళ చిత్రంతో నటిగా నా కెరీర్ మొదలైంది. ఆ సినిమా ప్రారంభంలోనే ఆగిపోయింది. తెలుగులోనూ నా మొదటి చిత్రం విడుదల కాలేదు. దానితో నాకు ఐరన్లెగ్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటే సినిమాలు ఆగిపోతున్నాయ్ అని ప్రచారం చేశారు. ఆ మాటలు విని కాస్త బాధపడినా ధైర్యంగా ముందుకెళ్లా. నా కష్టమే సక్సెస్ రూపంలో సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆ విమర్శన్నీ కనుమరుగైపోయాయి’’ అని కీర్తి సురేశ్ అన్నారు. తాజాగా ‘గుడ్ లక్ సఖి’తో ప్రేక్షకులను అలరించిన ఆమె చిరంజీవి ‘భోళా శంకర్’, మహేశ్ ‘సర్కారువారి పాట’ చిత్రాల్లో నటిస్తున్నారు.