Hebah Patel: వాటిని చాలా మిస్ అయ్యా!
ABN , First Publish Date - 2022-09-24T01:25:36+05:30 IST
‘అలా ఎలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘కుమారి 21ఎఫ్’తో గుర్తింపు పొందారు హెబ్బా పటేల్. కుమారి పాత్రతో యూత్లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.
‘అలా ఎలా’ (Ala ela)చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘కుమారి 21ఎఫ్’ (kumari 21F)తో గుర్తింపు పొందారు హెబ్బా పటేల్ (Hebah Patel). కుమారి పాత్రతో యూత్లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుసగా అవకాశాలు అందుకున్నా.. సరైన హిట్ అందుకోలేదు. తాజాగా ఓటీటీలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రం రాధికగా డీగ్లామర్ పాత్రతో మెప్పించింది. రాధ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హెబ్బాకు అవకాశాల కొదవేం లేదు. ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంది. తాజాగా ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ఒకటి సెట్స్ మీద ఉండగా, మరో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘రెడ్’ చిత్రంతో ‘డించక్’ అంటూ సాగే ఐటమ్ సాంగ్తో అలరించిన ఈ ముంబై బ్యూటీ ‘శాసనసభ’ చిత్రంలో కూడా ఓ ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు.
తాజాగా హెబ్బా పటేల్ విహారానికి (Nature lover)వెళ్లారు. షూటింగ్కు కాస్త విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో కొండ ప్రాంతాల్లో విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ‘కొండ ప్రాంతాలను చాలా మిస్ అవుతున్నా’ అని పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.