Sai Pallavi: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలపై సాయి పల్లవి వివరణ.. ఫైనల్‌గా ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-06-19T03:39:57+05:30 IST

‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చుకుంది. ఇన్‌స్టాగ్రాం ద్వారా ఒక వీడియో విడుదల చేసి..

Sai Pallavi: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలపై సాయి పల్లవి వివరణ.. ఫైనల్‌గా ఏం చెప్పిందంటే..

‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చుకుంది. ఇన్‌స్టాగ్రాం ద్వారా ఒక వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని సాయిపల్లవి ఆ వీడియోలో తెలిపింది. తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పేనని, ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పానని ఆమె తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించింది. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు తెలుసని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయిపల్లవి తన వివరణ వీడియోలో పేర్కొంది. విరాట పర్వం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సాయిపల్లవి వ్యక్తం చేసిన అభిప్రాయం వివాదానికి కారణమయిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలేంటంటే..


‘‘కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో ‘If You Taking A Religious Conflict’ లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో Cowని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ Difference ఎక్కడ ఉంది..? సో ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం’’ అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి.



సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు. ఎవరో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి, ఒక మొత్తం కమ్యూనిటీపై జరిగిన నర మేధానికి చాలా తేడా ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మా బాధను చిన్నచూపు చూడొద్దంటూ ట్వీట్ చేశాడు. ఒకసారి వచ్చి పగిలిన మా గుండెలను, ధ్వంసమైన మా ఇళ్లను సాయిపల్లవి చూడాలని, ఆ నర మేధానికి మిగిలిన సజీవ సాక్ష్యాలం తామేనని ఒక నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం. ఎట్టకేలకు విరాట పర్వం విడుదల తర్వాత సాయి పల్లవి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.

Updated Date - 2022-06-19T03:39:57+05:30 IST