DLJ: ‘దొంగలున్నారు జాగ్రత్త’.. తాజా అప్‌డేట్ ఇదే!

ABN , First Publish Date - 2022-06-01T00:21:49+05:30 IST

సురేష్ ప్రొడక్షన్స్‌ (Suresh Productions), గురు ఫిలింస్‌ (Guru Films) సంయుక్త నిర్మాణంలో డి సురేష్ బాబు (D Suresh Babu), సునీత తాటి (Sunitha Tati) నిర్మిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jagratha). యువ హీరో..

DLJ: ‘దొంగలున్నారు జాగ్రత్త’.. తాజా అప్‌డేట్ ఇదే!

సురేష్ ప్రొడక్షన్స్‌ (Suresh Productions), గురు ఫిలింస్‌ (Guru Films) సంయుక్త నిర్మాణంలో డి సురేష్ బాబు (D Suresh Babu), సునీత తాటి (Sunitha Tati) నిర్మిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jagratha). యువ హీరో శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) హీరోగా తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్‌ చిత్రానికి సతీష్ త్రిపుర (Satish Tripura) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం (survival thriller film) ‘దొంగలున్నారు జాగ్రత్త’ కావడం విశేషం.


తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో  శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు. సింగల్ లొకేషన్‌లో.. 72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు.


సినిమా కథాంశానికి వస్తే..  ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని (Preethi Asrani) కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని (Samuthirakani) ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ (Kaala Bhairava) సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-06-01T00:21:49+05:30 IST