టిల్లు నమ్మకపోయినా మీ అందరు నమ్మారు: నేహా శెట్టి పోస్ట్
ABN , First Publish Date - 2022-03-13T14:02:00+05:30 IST
'టిల్లు నమ్మకపోయినా మీ అందరు నమ్మారు'.. అంటూ 'డీజే టిల్లు' హీరోయిన్ నేహా శెట్టి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇటీవల ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన సినిమా ఇది.

'టిల్లు నమ్మకపోయినా మీ అందరు నమ్మారు'.. అంటూ 'డీజే టిల్లు' హీరోయిన్ నేహా శెట్టి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇటీవల ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన సినిమా ఇది. యూత్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. అయితే, చిత్ర హీరోయిన్కు ఈ మూవీ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. తన పాత్రను హైలెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేశారు. వాటికి నేహ శెట్టు ఘాటుగానే స్పందించింది.
ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. 'డీజే టిల్లు' సినిమాలో రాధికా పాత్రను టిల్లు నమ్మకపోయినా మీ అందరు నమ్మి పెద్ద హిట్ చేశారని, అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నానని.. అలాగే, ఇకనుంచి కూడా ఈ జర్నీని ఇంతే మెమొరబుల్గా కొనసాగించేందుకు నా వంతు కృషి చేస్తానని..తను పెట్టిన పోస్ట్లో రాసుకొచ్చింది. మరి ఎందుకు నేహ ఇలా ఎమోషనల్ పోస్ట్ పెట్టిందో తెలియదు గానీ..ఇప్పుడిది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన ఓ సినిమా చేసి ఆకట్టుకుంది.