Parasuram : తదుపరి చిత్రంపై క్లారిటీ.. హీరో ఇతడే !

ABN , First Publish Date - 2022-05-08T13:47:40+05:30 IST

‘యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పరశురామ్ (Parasuram). వీటిలో ‘గీత గోవిందం’ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) తో ‘సర్కారువారి పాట’ చిత్రం డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

Parasuram : తదుపరి చిత్రంపై క్లారిటీ.. హీరో ఇతడే !

‘యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పరశురామ్ (Parasuram). వీటిలో ‘గీత గోవిందం’ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) తో ‘సర్కారువారి పాట’ చిత్రం డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మే 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజులే టైముంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే పరశురామ్ ఒక ఇంటర్వ్యూలో ‘సర్కారువారి పాట’ చిత్రం విశేషాలతో పాటు .. తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన సంగతుల్ని కూడా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు.


‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata)  లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ తెరకెక్కించిన తర్వాత పరశురామ్.. తన తదుపరి చిత్రాన్ని పెద్ద హీరోతోనే చేస్తాడని అనుకున్నారు అందరూ. అతడు చేయబోయేది నాగచైతన్య (Naga chaitanya) తో అని వార్తలు వినిపించాయి. అయితే దీన్ని అందరూ రూమర్ గా కొట్టి పడేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పరశురామ్ తన నెక్స్ట్ మూవీ నాగచైతన్యతోనే అని క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి ‘సర్కారువారి పాట’ చిత్రం కన్నా ముందు నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నాడు పరశురామ్ (Parasuram). అయితే మహేశ్ బాబు తో అనుకోకుండా ఛాన్స్ కొట్టేసిన పరశురామ్... ‘సర్కారువారి పాట’ చిత్రాన్నే ముందుగా పట్టాలెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రెడీ అవడంతో.. పరశురామ్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. 


‘గీతగోవిందం’ చిత్రం తర్వాత నాగచైతన్య (Naga chaitanya)  కోసం ఆల్రెడీ స్ర్కిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళతానని చెబుతున్నాడు పరశురామ్ (Parasuram). కథానాయికలుగా పూజా హెగ్డే, రష్మికా పేర్లు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే (Pooja hegde) తో ఇది వరకు ‘ఒక లైలా కోసం’ 'సినిమాలో నటించాడు చైతూ. ఇప్పుడు మరోసారి ఆమెతో రొమాన్స్ చేయనుండడం విశేషం. ‘లవ్ స్టోరీ, బంగార్రాజు’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న నాగచైతన్య (Naga chaitayna) ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమాలోనూ, దూత అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు. అలాగే. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. మరి పరశురామ్ .. చైతూతో ఏ తరహా చిత్రం తెరకెక్కిస్తాడో చూడాలి.   

Updated Date - 2022-05-08T13:47:40+05:30 IST