‘ఖిలాడి’ బ్యూటీకి కరోనా!
ABN, First Publish Date - 2022-01-17T02:08:16+05:30
హీరోయిన్ డింపుల్ హయాతీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు డింపుల్ ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ‘‘రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండి డాక్టర్లు సూచనలను పాటిస్తున్నాను.
హీరోయిన్ డింపుల్ హయాతీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు డింపుల్ ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ‘‘రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండి డాక్టర్లు సూచనలను పాటిస్తున్నాను. అందరూ మాస్క్ ధరించండి. శానిటైజ్ చేసుకోండి.. వ్యాక్సిన్ తీసుకోండి. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తా’’ అని పేర్కొన్నారు. ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా.. జర్రా పాటతో హాట్హాట్గా ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపిన ఈ సుందరి ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.