Ponniyin Selvan- Dil raju: చుక్కలు చూపిస్తున్నారు!
ABN , First Publish Date - 2022-09-24T21:33:23+05:30 IST
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమంది హీరోహీరోయిన్లనుపెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించడం తీయడం గొప్ప విషయం.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమంది హీరోహీరోయిన్లనుపెట్టి మణిరత్నం(Maniratnam)గారు ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించడం తీయడం గొప్ప విషయం. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లాగే ‘పొన్నియిన్ సెల్వన్ 1( Ponniyin Selvan-1)’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని భావిస్తున్నా’’ అని దిల్ రాజు (Dil raju)అన్నారు. చియాన్ విక్రమ్(Vikram), ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్రాజ్, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 30న విడుదలకానుంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ ‘‘పెళ్లికి ముందు మణిరత్నం ఓ పెద్ద బ్యాగ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. దానిలో ‘పొన్నియిన్ సెల్వన్’ నవల 5 భాగాలుగా ఉంది. అదంతా చదివి ఒక్క లైన్లో చెప్పమన్నారు. నేను అది చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాేసది? అంటూ అదోలా చూశారు. దాంతో మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డా. మా పెళ్లయిన 34 ఏళ్లకు పొన్నియిన్ సెల్వన్ తీశారాయన. ‘నలభైౖ రెండేళ్లుగా ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమని ‘పొన్నియిన్ సెల్వన్’పై చూపించండి, ఈ సినిమా పది శాతం చెన్నైలో చిత్రీకరణ జరిగితే మిగతాదంతా రాజమండ్రి, హైదరాబాద్లో ప్రాంతాల్లో చేశాం. దీనిని తెలుగు సినిమాగా భావించి అందరూ ఆదరించాలి’’ అని అన్నారు.
‘‘ఈ చిత్రంలో అందరూ హీరోలే.. అందరూ హీరోయిన్లే! నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అని విక్రమ్ చెప్పారు.
‘‘నా మొదటి చిత్రం ‘ఇద్దరు’ మణిరత్నంగారితో చేశాను. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని ఐశ్వర్యారాయ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్తీ, రెహమాన్, శరత్కుమార్, జయం రవి, త్రిష, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.