సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dil raju & Harish shankar : దొంగతనం పక్కా !

ABN, First Publish Date - 2022-01-27T16:07:38+05:30

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. ఆసక్తికరమైన కంటెంట్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. సీజన్ లోని ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠకు గురి చేస్తూండడంతో రాను రాను వెబ్ సిరీస్ లపై మోజు పెరుగుతోంది. సినిమాగా తీయలేని ఎన్నో వైవిధ్యమైన కథలు ఇప్పుడు వెబ్ సిరీస్ గా మారుతున్నాయి. బడా దర్శక, నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ నిర్మాణం వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇప్పుడో క్రైమ్ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. ఆసక్తికరమైన కంటెంట్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. సీజన్ లోని ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠకు గురి చేస్తూండడంతో రాను రాను వెబ్ సిరీస్ లపై మోజు పెరుగుతోంది. సినిమాగా తీయలేని ఎన్నో వైవిధ్యమైన కథలు ఇప్పుడు వెబ్ సిరీస్ గా మారుతున్నాయి. బడా దర్శక, నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ నిర్మాణం వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇప్పుడో క్రైమ్ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టారు. ఇదో హైస్ట్ థ్రిల్లర్. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమ్ అవడానికి ఒప్పందం కుదిరింది. ఈ సిరీస్ పేరు ‘ఏటీయమ్’.


దిల్ రాజు, హరీశ్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్త నిర్మాణంలో వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి చంద్రమోహన్ దర్శకుడు. హైదరాబాద్ నగరంలో జరిగిన అతిపెద్ద దొంగతనంపై ఈ వెబ్‌‌సిరీస్ రూపొందుతోంది. హరీశ్ శంకర్ ఆసక్తికరమైన కథని అందించారు. ‘దొంగతనం పక్కా’ అంటూ.. ఈ సిరీస్ వివరాలు వెల్లడిస్తూ.. షూటింగ్ త్వరలో మొదలు కానున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఇంకా నటీనటుల వివరాలు తెలుపలేదు. మరి ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 



Updated Date - 2022-01-27T16:07:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!