మల్లయోధుడిగా...
ABN , First Publish Date - 2022-12-26T00:00:55+05:30 IST
మోహన్లాల్ కథానాయకుడిగా లిజో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది...
మోహన్లాల్ కథానాయకుడిగా లిజో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. జార్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘మలైకొట్టై వలిబన్’ అనే పేరు ఖరారు చేశారు. ఇందులో మోహన్లాల్ మల్లయోధుడిగా నటించనున్నారు. జనవరిలో రాజస్థాన్లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. ‘‘ఈ కాంబినేషన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. త్వరలోనే మిగిలిన వివరాలు ప్రకటిస్తామ’’ని చిత్రబృందం తెలిపింది.