అనుపమ పరమేశ్వరన్కు కరోనా..
ABN , First Publish Date - 2022-08-24T23:03:32+05:30 IST
‘కార్తికేయ 2’ (Karthikeya 2) లో లీడ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటూ రెస్ట్
‘కార్తికేయ 2’ (Karthikeya 2) లో లీడ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ‘కార్తికేయ 2’ అనుపమకు ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలై.. సెన్సెషనల్ హిట్టయింది కూడా. హిందీ సినిమాలని తలదన్నే విధంగా బాలీవుడ్ (Bollywood)లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనుపమ చాలా రోజులు కష్టపడ్డారు.
ముందుగా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణలో చాలా ప్రాంతాలు ఆమె పర్యటించారు.. అలాగే పలు కాలేజీలకు కూడా వెళ్లారు. చాలా దగ్గరగా అభిమానులతో తిరుగుతూ సినిమాకి విస్తృత ప్రచారం చేశారు. అలాగే, ఎప్పుడైతే హిందీలో కూడా ‘కార్తికేయ 2’ చిత్రం హిట్టయిందో.., మళ్ళీ ఆమె నార్త్ అంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నేపధ్యంలో ఆమెకి సరైన నిద్ర, తిండి కూడా లేకపోయినా, సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇలా తిరగటం వల్లనో.. ఏమో ఆమెకి కరోనా సోకింది. ఇప్పుడు ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక వారం రోజుల్లో మళ్ళీ కోలుకుని షూటింగ్స్కి హాజరు అవుతారని తెలిసింది.