Sarkaru Vaari Paata: నీ బ్రెయిన్కి హ్యాట్సాఫ్ మహీంద్రా జీ...
ABN , First Publish Date - 2022-06-01T03:05:12+05:30 IST
పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ మూవీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ మూవీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చేసిన ట్వీట్ వైరల్గా మారింది. అనుపమ్ తరేజా (Anupam Thareja) ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా, ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘సూపర్ స్టార్ మహేశ్ బాబు, జావా మెరూన్(Jawa Maroon)ల కాంబినేషన్ అన్బీటబుల్. ఈ డేడ్లి కాంబినేషన్ను ఎలా చూడకుండా ఉండగలను. ప్రస్తుతం న్యూయార్క్ (NewYork)లో ఉన్నాను. న్యూ జెర్సీ (NewJersey)కి వెళ్లి సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడికి వెళ్లి చూస్తాను’’ అని ట్వీట్ చేశారు. మహేశ్ సినిమాకి ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ మ్యాన్ ట్వీట్ చేయడంతో, మహేశ్ ఫాన్స్ ఈ ట్వీట్ని వైరల్ చేస్తున్నారు.
అసలు ఆనంద్ మహీంద్రా.. ‘సర్కారు వారి పాట’ గురించి ట్వీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా? అని చూస్తే... ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం ఇండియాలో జావా బైక్స్ మేకింగ్ అండ్ సెల్లింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇండియాలో ఈ బైక్ సేల్స్ కూడా చాలా బాగున్నాయి. జావా బైక్స్ రైడర్కి మంచి కిక్ ఇస్తాయి కానీ.. ఈ బైక్స్కి రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి గట్టి పోటీ కూడా ఉంది. సో.. జావా బైక్స్కి ప్రొమోషన్స్ కావాలి. ఎలాగో మహేశ్, జావా బైక్ని ‘సర్కారు వారి పాట’ సెకండ్ హాఫ్లో బాగా వాడేశాడు కాబట్టి... ఆనంద్ ఇదో బిజినెస్ స్ట్రాటజీగా ప్లాన్ చేసి మహేష్ నటించిన ఆ సినిమా చూస్తానని ట్వీట్ చేశారు. ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా, ఆ మాత్రం ప్లాన్ వేయడంలో తప్పు లేదులే. మరి.. మహేశ్ ఫాన్స్, తమ హీరోని ఫాలో అవుతూ జావా బైక్స్ ఎంత వరకూ కొంటారు అనేది వేచి చూడాలి.