Ameesha Patel: తారక్ కోసం ట్వీట్.. తప్పని తిప్పలు!
ABN , First Publish Date - 2022-09-19T00:08:25+05:30 IST
హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel)చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్కు(trolling) గురి చేసింది. తన కోస్టార్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఓ పోస్ట్ చేసి తారక్(Jr ntr)కి బదులు వేరే నెటిజన్ ఖాతాను ఆమె ట్యాగ్ చేశారు.
హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel)చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్కు(trolling) గురి చేసింది. తన కోస్టార్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఓ పోస్ట్ చేసి తారక్(Jr ntr)కి బదులు వేరే నెటిజన్ ఖాతాను ఆమె ట్యాగ్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు అది ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ కాదని సరిగ్గా, చూసుకొని ట్వీట్ చేయాలని వరుస కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. ప్యాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన తన కోస్టార్ తారక్ను అభినందిస్తూ అమీషా ట్వీట్ ఈ చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగులో ‘నరసింహుడు’(Narasimhudu) చిత్రం చేశారు. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తనకు ఆనందంగా ఉందంటూ అమీషా ట్వీట్లో పేర్కొన్నారు. ఆ మేరకు ‘నరసింహుడు’ చిత్రంలోని ఓ ఫొటో షేర్ చేశారు. ‘‘ఎన్టీఆర్తో కలిసి నేను నటించిన తెలుగు సినిమాలోని ఫొటో ఇది. టాలీవుడ్లో స్టార్గా పేరు పొందిన ఆయన ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. లవ్లీ కోస్టార్. కష్టపడే గుణం, నిజాయతీ కలిగిన వ్యక్తి’’ అని ఆమె ట్వీట్ చేశారు.
అయితే, ఈ ట్వీట్ని ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేయకుండా వేరే ఖాతాకు ట్యాగ్ చేశారు అమీషా పటేల్. రెండోసారి చేసిన ట్వీట్కు కూడా అలాగే చేశారు. మూడోసారి మాత్రం ట్యాగ్ లేకుండా పోస్ట్ చేశారు దీనిని గమనించిన కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు అయితే చూసుకోవాలి కదా మేడమ్ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.