Alluri Seetharamaraju: చలన చిత్రమాలికలో ఓ మణిపూస!

ABN , First Publish Date - 2022-11-15T19:27:01+05:30 IST

‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు.. తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Alluri Seetharamaraju: చలన చిత్రమాలికలో ఓ మణిపూస!


‘తెలుగువీర లేవరా’ (Teluguveera levara)అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన  వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు. (alluri seetharamaraju

తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు..


తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ (Devudulanti manishi)తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.


ప్రయోగాలకు ‘నేనంటేనేనే’ అని నిరూపించిన ‘ప్రతిభావంతుడు’’ శాశ్వతంగా సినీలోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 


రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా ‘రియల్‌ హీరో’ అనిపించుకున్న ‘కిలాడీ కృష్ణుడు’ ఇక సెలవంటూ నింగికెగిశారు. 


టాలీవుడ్‌కు ఈస్ట్‌మన్‌, కలర్‌, స్కోప్‌, 70 ఎంఎం వంటి టెక్నాలజీని పరిచయం చేసిన నటశేఖరుడు సూపర్‌స్టార్‌ (Superstar krishna)కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కృష్ణ నటించిన 350కు పైగా చిత్రాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ మాత్రం ఆయన కెరీర్‌కే కాదు... చిత్ర పరిశ్రమకూ ఎంతో ప్రత్యేకం. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన చిత్రమిది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే సూపర్‌స్టార్‌ కృష్ణే గుర్తొస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో ఆ పాత్ర నాటుకుపోయింది. ఈ చిత్రాన్ని చిత్రమాలికలో ఓ మణిపూసగా చెబుతారు. ఆ చిత్రం జ్ఞాపకాలు మీ కోసం...


‘తేనె మనసులు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణ ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆయన నటించిన 12వ చిత్రం ‘అసాధ్యుడు’ చిత్రంతో అంతర్నాటకంలో కృష్ణ అల్లూరిగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుని కథని సినిమాగా మలచాలనే ఆలోచన వచ్చింది. అంతకు ముందు జగ్గయ్య ఆలుమగలు చిత్రంలో పోషించిన అల్లూరి పాత్ర కూడా కృష్ణకు ఒక స్ఫూర్తి. అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు  ప్రయత్నాలు చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అదే ఆలోచన ఎన్టీఆర్‌కీ వచ్చింది. నాటక రచయిత పడాల రామారావుతో స్ర్కిప్టు కూడా సిద్ధం చేయించారు.  కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత శోభన్‌బాబు కూడా ఇదే ప్రయత్నం చేశారు. దేవదాసు నిర్మాత డి.ఎల్‌. శోభన్‌బాబుతో ఈ సినిమా తీయాలని చూసినా, అది కూడా విజయం కాలేదు. అప్పుడప్పుడే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకుంటూ ఉండటంతో తన పథకాన్ని మనసులోనే ఉంచుకుని సమయం కోసం చూశారు కృష్ణ.  త్రిపురనేని మహారథితో స్ర్కిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం కట్టారు.. మహారథి అప్పట్లో చాలా బిజీ రైటర్‌. ఈ చిత్రం కోసం ఆయన అంగీకరించిన చాలా చిత్రాలను కాదనుకున్నారు. ఆదర్శయోధుడి గురించి పరిశోధన మొదటుపెట్టి కథ తయారు చేశారు. 1973 డిసెంబరు 12న సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. పద్మాలయా సంస్థకు ఆస్థాన కెమెరామెన్‌  వి.ఎస్‌.ఆర్‌. స్వామి, మన్య ప్రాంతంలో సినిమా షూటింగు జరిపే పక్షంలో సినిమాస్కోప్‌లో చిత్రాన్ని నిర్మిేస్త అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాహసాలు చేయడానికి వెనకాడని కృష్ణ అప్పట్లోనే ముంబై నుంచి లెన్స్‌లు తెప్పించారు. విశాఖపట్నం సమీప అడవుల్లో రెండు నెలలపాటు షూటింగు చేేసందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామలింగేశ్వరరావు కృషి మాటల్లో చెప్పలేనిది. నాగరిక ప్రపంచానికి నలభైౖ మైళ్ళ దూరంలో కొండ, కోనల మద్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్‌ మొత్తానికి సౌకర్యా?ను కల్పించే కృషి చేశారు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, అన్నవరం, కృష్ణదేవిపేట, మన్యప్రాంతాల్లో శీతకాలంలో నిర్విరామంగా దాదాపు రెండు నెలలు షూటింగ్‌ జరిపారు. నటీనటులతోపాటు సాంకేతిక సిబ్బంది కూడా ఒక అనిర్వచనీయమైన భావావేశంతో కృషిచేసి చిత్ర నిర్మాణాన్ని సక్సెస్‌ చేశారు. . తొలిప్రయత్నంలోనే  షాట్‌ ఒకే అయ్యేది. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందొరగా నటించిన గుమ్మడి చెబుతుండేవారు. మన్యంలో షూటింగు జరిగినన్ని రోజులు మహారథి ఒకపూట మాత్రమే భోజనం చేేసవారు. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి ఒకరోజు దూరంగా వెళ్లి సాయంకాలం వరకూ రాలేదు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. ఈ చిత్రం కోసం కృష్ణ ఏకదాటిన 30 కాల్షీట్లు పనిచేశారు.


చిత్ర దర్శకుడు వి. రామచంద్రరావు కృష్ణ నటించిన మూడో చిత్రం గూఢచారి 116 చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌. కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’ రామచంద్రరావుకి దర్శకుడిగా తొలి చిత్రం. తర్వాతి చిత్రం మరపురాని కథలో కూడా హీరో కృష్ణే. నేనంటే నేనే, అఖండుడు, కర్పూర హారతి, ఆస్తుల –అంతస్తులు వంటి 13 విజయవంతమైన కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామచంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించక ముందు.. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశారు. అందుకే వీరిద్దరి బంధం బలమైనది. అయితే సినిమా చివరి దశ నిర్మాణంలో ఉండగా తన 47వ యేట ఫిబ్రవరి 14న రామచంద్రరావు మృతిచెందారు. తర్వాత కృష్ణనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించమని మహారథి అడిగినా దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌ దాసుకు ఆ పనులు అప్పగించారు కృష్ణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తీసినా తన సినిమా విజయాన్ని కళ్లారా చూడకుండానే రామచంద్రరావు మరణించడం దురదృష్టకరం. ఈ సినిమా 17 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని అందుకుంది. రిపీట్‌లో కూడా వందరోజులు ఆడిన మాయాబజార్‌, దేవదాసు చిత్రాల జాబితాలో అల్లూరి సీతారామరాజు స్థానం దక్కించుకుంది. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తీయడం ఇష్టం లేని ఎన్టీఆర్‌ ప్రత్యేక షో చూసి కృష్ణను అభినందించారు. ఆ తర్వాత తను తీయాలనుకున్న చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

ఈ చిత్రంలో  శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉత్తమ గీత రచన బహుమతి లభించింది. తెలుగు సినిమాకు ఇలాంటి పురస్కారం రావడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి బంగారు నందిని బహూకరించింది. ఆఫ్రో–ఏషియన్‌ చలన చిత్రోత్సవంలో కూడా అవార్డు అందుకొంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ పేరిట అనువదించి విడుదల చేశారు. ూ స్వర్ణోత్సవం సందర్బ?ంగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు. పి.ఆదినారాయణరావు సంగీతం అందించిన పాటలు ఈ చిత్రానికి ఆణిముత్యాలుగా చెబుతారు. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజులు ఈ చిత్రానికి సాహిత్యం అందించారు.  ‘రగిలింది విప్లవాగ్ని ఈరోజు.. ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’ అనే ఆరుద్ర గీతాన్ని బాలు ఆలపించారు. ఈ పాటను బెర్లిన్‌లోని హంబోల్డ్‌ విశ్వవిద్యాలయ ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు. సినిమా టైటిల్స్‌ పడేటప్పుడు ఈ పాట నేపథ్యంలో వినిపిస్తుంది. సుశీల పాడిన సి.నారాయణరెడ్డి గీతం ‘వస్తాడు నారాజు ఈరోజు..’ శ్రీ రాగంలో రూపుదిద్దుకుంటే, విజయనిర్మలపై ఆ పాట చిత్రీకరణ ఒక అద్భుతమనే చెప్పాలి. మూడు గంటల్లో ఈ పాటను చిత్రీకరించారు. కొచ్చాడయన్‌ చిత్రానికి ఉపయోగించిన మోషన క్యాప్చరింగ్‌ టెక్నిక్‌ వచ్చేలా, ఆరోజుల్లో సాధారణ కెమెరాలతో వి.ఎస్‌.ఆర్‌. స్వామి చిత్రీకరణ జరపడం మేధావుల్ని సైతం ఆశ్చర్యపరచింది. కొసరాజు రాసిన ‘జంబైలే జోరు జంబరు హైలేసా’ పాట చంద్రమోహన్‌, మంజుల, జయంతి బృందంపై రోడ్డు రోలర్‌తో మన్యంలో బాట వేేస సందర్బంగా చిత్రీకరించారు. ‘ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా... ఈ దిక్కులేని వాళ్ల ఎతలు తీర్చిపోడా’ అనే  చరణంలో సీతారామరాజు కాషాయ వస్త్రంలో ప్రత్యక్షం కావడం ఈ పాటకు హైలైట్‌. మరో కొసరాజు పాట ‘కొండదేవత నిన్ను కొలిచేమమ్మా కోటి కోటి దండాలు’ను చింతపల్లి అడవుల్లో వేసిన గుహ సెట్‌లో చిత్రీకరించారు. అవుట్‌ డోర్‌లో చిత్రీకరించిన మొదటి పాట ఇదే. అంతేకాదు. సినిమాస్కోప్‌ లెన్స్‌ పనిచేస్తున్న తీరు పరీక్షించేందుకు ప్రయోగం ఈ పాట మీదే చేశారు. ఇక జాతీయ బహుమతిని తెచ్చిపెట్టిన శ్రీశ్రీ గితం తెలుగు వీర లేవరా.. అంటూ సీతారామరాజు మన్యం ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెల్లదొరలపై తిరుగుబాటు చేేసందుకు సమాయత్తపరిచే పాట వందేమాతరం నినాదంతో ముగుస్తుంది. ఘంటసాల అస్వస్థతకు గురైన సమయంలో కూడా.. ఉద్రేకంగా ఆలపించిన అద్భుత గీతమిది. సినిమాలో ఆఖరి పాటను సంగీత దర్శకుడు ఆదినారాయణరావు స్వయంగా రాసి స్వరపరచిన ‘హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌ మెర్రీ మెర్రీ క్రిస్మస్‌’ పాటను ఆల్‌ ఇండియా రేడియో పాపులర్‌ సింగర్‌ రీటా తన బృందంతో పాడగా, ప్రముఖ బెంగాలీ నటీ నందితా బోస్‌, జగ్గయ్య, రాజనాల తదితర నటీనటులతో మన్యంలో చిత్రీకరించారు. కాంతారావు, పేకేటి, రావుగోపాలరావు, చంద్రమోహన్‌, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, కె.వి. చలం, విజయనిర్మల, మంజుల, పండరీబాయి వంటి తారలు నటించిన ఈ చిత్రం 1974 మే ఒకటో తేదీని విడుదలై ఘన విజయం సాధించింది. చిత్రమాలికలో ఓ మణిపూసగా నిలిచింది. 



Updated Date - 2022-11-15T19:27:01+05:30 IST