Allu Arjun: ‘మేజర్‌’ ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది!

ABN , First Publish Date - 2022-06-04T22:07:30+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘మేజర్‌’(Major) చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ (allu arjun)సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిచారు. ‘‘సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ (Adivi sesh)మరోసారి మ్యాజిక్‌ చేశాడు.

Allu Arjun: ‘మేజర్‌’ ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది!

ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘మేజర్‌’(Major) చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ (allu arjun)సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిచారు. ‘‘సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ (Adivi sesh)మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో కీలక పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ అందించారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేశ్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘మేజర్‌’ (major)కథ ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


26/11 ముంబై ఉగ్రదాడుల్లో శత్రువులపై చివరి క్షణం వరకూ పోరాడి అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు(Maheshbabu), అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 




Updated Date - 2022-06-04T22:07:30+05:30 IST