Allu Arjun : అరుదైన గౌరవం
ABN, First Publish Date - 2022-08-22T16:58:07+05:30
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్లో జరిగే ‘ఇండియా డే పరేడ్’ (India Day Parade) కి ఈ ఏడాది యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ (Grand Marshal) హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ (Sneha) తో కలిసి హాజరయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్లో జరిగే ‘ఇండియా డే పరేడ్’ (India Day Parade) కి ఈ ఏడాది యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ (Grand Marshal) హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ (Sneha) తో కలిసి హాజరయ్యారు. దాదాపుగా ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు, ఇంత స్థాయిలో ‘న్యూయర్క్ డే పరేడ్’ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ‘ఇండియా డే పరేడ్’ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
అలానే ఈ సందర్శన లో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams)ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు, వారి సంభాషణల మధ్యలో అల్లు అర్జున్తో కలిసి ఎరిక్ ఆడమ్, ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన ‘పుష్ప’ (Pushpa) చిత్రంలోని ‘తగ్గేదేలే’.. డైలాగ్ ఫోజ్ పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం షూటింగ్లో పాల్గొనే బిజీలో ఉన్నారు.