Ponniyin Selvan: సినిమా విజయంతో కార్తి భావోద్వేగ లేఖ

ABN , First Publish Date - 2022-10-03T00:16:32+05:30 IST

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.

Ponniyin Selvan: సినిమా విజయంతో కార్తి భావోద్వేగ లేఖ

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. జయం రవి,  ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. ఈ సినిమాలో కార్తి (Karthi) వంథియ దేవన్‌గా నటించాడు.  చిత్రం సంచలన విజయం సాధించడంతో  ఉబ్బితబ్బిబయ్యాడు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 


తన అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదని కార్తి చెప్పాడు. ‘‘వంథియ దేవన్‌ (Vanthiyethavan) గా నటించడం అద్భుతంగా ఉంది. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి అద్భుతమైన నవలను రాసిన కల్కికి బిగ్ సెల్యూట్. ఈ సినిమాను తెరకెక్కించడానికి మణిరత్నం మూడేళ్లు కష్టపడ్డాడు. మరచిపోలేని అనుభూతిని ఇచ్చాడు. అందుకు మిలియన్ల కృతజ్ఞతలు. గతంలో ఎన్నడు ఇవ్వని విధంగా అద్భుతమైన విజువల్స్‌ను ఇచ్చిన రవివర్మన్‌కు ధన్యవాదాలు. చిత్రంలో కీలక పాత్రలు పోషించిన నటులందరికి థాంక్యూ. సినిమా మీద ప్రేమతో సన్నివేశాలకు వెనుక సైనికులుగా పనిచేసిన వారికి కూడా కృతజ్ఞతలు. చివరగా మూవీపై ప్రేమను చూపించిన స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు’’ అని కార్తి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. చోళుల నేపథ్యంలో ‘పొన్నియిన్ సెల్వన్’ ను రూపొందించారు. రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలి భాగం ఈ మధ్యనే విడుదలైంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. తొలి భాగం వచ్చిన ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల తర్వాత ‘పొన్నియన్ సెల్వన్-2’ విడుదల కానుందని మణిరత్నం పేర్కొన్నాడు.    




Updated Date - 2022-10-03T00:16:32+05:30 IST