Adivi sesh Clarity: ‘మేజర్‌’కు సాధారణ టికెట్‌ ధరలే!

ABN , First Publish Date - 2022-05-23T20:55:12+05:30 IST

‘మేజర్‌’ సామాన్యులు చూడాల్సిన అసాధారణ చిత్రం’ అని అడివి శేష్‌ అన్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన మేజర్‌ చిత్రం జూన్‌ 3న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అడివి శేష్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Adivi sesh Clarity: ‘మేజర్‌’కు సాధారణ టికెట్‌ ధరలే!

‘మేజర్‌’ (Major)సామాన్యులు చూడాల్సిన అసాధారణ చిత్రం’ అని అడివి శేష్‌ (Adivi sesh)అన్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన మేజర్‌ చిత్రం జూన్‌ 3న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అడివి శేష్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘టికెట్‌ రేట్లు తగ్గిస్తే సినిమాను మేం రిపీట్‌గా సినిమా చూస్తాం’ అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శేష్‌ (Ask sesh)క్లారిటీ ఇచ్చారు. ‘‘మేజర్‌’ చిత్రానికి టికెట్‌ రేట్లు సాధారణంగా ఉంటాయి. సామాన్యులు చూడాల్సిన అసాధారణ చిత్రమిది. టికెట్‌ రేట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ చిత్రంలో మనకు తెలియని సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని చెబుతున్నాం. నా గత చిత్రాలు ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ చిత్రాలను మించి ఈ చిత్రం ఉంటుంది’’ అని అన్నారు. మళ్లీ మహేశ్‌ బ్యానర్‌ సినిమా ఎప్పుడు చేస్తావ్‌ అన్న ప్రశ్నకు ‘‘ఆదివారం జరిగిన మీటింగ్‌లో నేను, నమ్రతగారు అదే హ్యాపీగా అనుకున్నాం. అంతా దేవుడి దయ’’ అంటూ శేష్‌ సమాధానమిచ్చారు. (Adivi sesh clarity on ticket rates)


‘‘థ్రిల్లింగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ మీకు నచ్చిందా? అని ఓ నెటిజన్‌ అడగగా.. ‘‘కట్‌ అవుట్‌ ఉన్నప్పుడు టైటిల్‌ అవసరంలేదు. కంటెంట్‌ ఉన్నప్పుడు కట్‌ అవుట్‌ అవసరం లేదు. జూన్‌ 3న మేజర్‌ చూశాక మీకు అది క్లియర్‌గా అర్థమవుతుంది’’ అన్నారు అడివి శేష్‌. 


Updated Date - 2022-05-23T20:55:12+05:30 IST