సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Actor Prabhu: టాలీవుడ్‪కు తొమ్మిదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ

ABN, First Publish Date - 2022-05-11T03:12:29+05:30

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు ప్రభు తొమ్మిదేళ్ళ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), దళపతి విజయ్‌ (Thalapathy Vijay) కాంబినేషన్‌లో ఓ చిత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు ప్రభు తొమ్మిదేళ్ళ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), దళపతి విజయ్‌ (Thalapathy Vijay) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే ఈ మూవీని తమిళ ప్రేక్షకులు లైక్‌ చేసేలా తమిళ నేటివిటీతో రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇందులో అనేక మంది అగ్ర నటీనటులను ఎంపిక చేశారు. వారిలో ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, ప్రభు వంటి మరికొందరు తమిళ నటులు కూడా ఉన్నారు. వీరిలో ప్రభు (Prabhu) మాత్రం తొమ్మిదేళ్ళ తర్వాత తెలుగు చిత్రంలో కనిపించనున్నారు. నిజానికి 2010 తర్వాత ప్రభు టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆరిస్ట్‪గా ముద్రపడ్డారు. 2013లో వచ్చిన ‘ఒంగోలు గిత్త’ చిత్రంలో నటించిన ప్రభు ఆ తర్వాత ‘వీడెవడు’ అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఇపుడు విజయ్‌ నటించే తన 66వ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రను పోషించనున్నారు.


ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని చిత్రయూనిట్ మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ 66వ (Vijay66) చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‪లో భారీ తారాగణం కనువిందు చేయనుందని తెలుపుతూ.. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్ (Sarath Kumar), ప్రభు, ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రీకాంత్ (Srikanth), జయసుధ (Jayasudha) వంటి వారితో పాటు శామ్ (Shaam), యోగిబాబు (Yogibabu), సంగీత (Sangeetha), సంయుక్త (Samyuktha) ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి(Pongal 2023) కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోని.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడనే వార్త వచ్చినప్పుడే.. ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మాములుగా ఏర్పడలేదు. కాగా, హీరో విజయ్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‪తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.



Updated Date - 2022-05-11T03:12:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!