దోపిడీ దొంగల కథ
ABN , First Publish Date - 2022-09-24T06:01:45+05:30 IST
ఫృథ్విరాజ్, అనూ మెహతా జంటగా పిఎ్సఆర్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిరాజ్ దర్శకుడు...
ఫృథ్విరాజ్, అనూ మెహతా జంటగా పిఎ్సఆర్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిరాజ్ దర్శకుడు. ప్రవీణ శివరాజ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘దోపిడీ నేపథ్యంలో సాగే కథ ఇది. 27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. నవంబరులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు.