రామ్‌చరణ్‌కు 4, ఎన్టీఆర్‌కు 8 ఫస్ట్‌ ర్యాంక్‌ ధను్‌షదే!

ABN , First Publish Date - 2022-12-08T10:32:15+05:30 IST

హీరోహీరోయిన్లకు అభిమానులు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ప్రతి ఏడాది చివరిలో ర్యాంకులు ప్రకటిస్తుంటుంది....

రామ్‌చరణ్‌కు 4, ఎన్టీఆర్‌కు 8 ఫస్ట్‌ ర్యాంక్‌ ధను్‌షదే!

హీరోహీరోయిన్లకు అభిమానులు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ప్రతి ఏడాది చివరిలో ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. బుధవారం ‘మోస్ట్‌  పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ ఆఫ్‌ ఇండియా  2022’ జాబితాను ప్రకటించింది. మొదటి స్థానంలో తమిళ హీరో ధనుష్‌ నిలిచారు. అలియా భట్‌ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానం ఐశ్యర్యా రాయ్‌ పొందారు. ఇక మన తెలుగు హీరోల్లో రామ్‌చరణ్‌ నాలుగోస్థానంలో నిలవగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. అల్లు అర్జున్‌కు తొమ్మిదో స్థానం లభించింది. సమంత, హృతిక్‌ రోషన్‌, కియారా అడ్వాణీ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రంలో నటించిన యష్‌ తొలిసారిగా ఐఎండీబీలో ఖాతా తెరిచారు. ఆయనకు పదో ర్యాంక్‌ లభించింది. ఐఎండీబీ ర్యాంకుల్లో దక్షిణాది తారల హవా స్పష్టంగా కనిపిస్తుండడం ఈ సారి విశేషం.


Updated Date - 2022-12-08T10:32:15+05:30 IST