కెమెరాలను తప్పించుకునేందుకే ఆ నిర్ణయం తీసుకున్న అలియా
ABN , First Publish Date - 2022-04-09T23:51:46+05:30 IST
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నారు.
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.
పెళ్లి నేపథ్యంలో కెమెరాల కంట పడకుండా ఉండేందుకు అలియా భట్ ప్రయత్నిస్తుంది. ఇంటి నుంచి బయటికి రావడానికి ఆమె ఇష్ట పడటం లేదని బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాను తప్పించుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘‘ముంబైలో ప్రతీ చోటా ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అలియాకు ఇష్టం లేదు. మీడియా కెమెరాలను తప్పించుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’’ అని అలియాతో సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి చెప్పారు. పెళ్లి జరిగే తేదీని మాత్రం అలియా, రణ్బీర్ రహస్యంగా ఉంచారు. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.