‘Koffee With Karan -7’ చాట్ షోకీ రాబోతున్న సౌతిండియన్ సెలబ్రిటీస్

ABN , First Publish Date - 2022-05-05T23:00:45+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మే 4న కీలక ప్రకటన చేశాడు. తాను హోస్ట్ చేసే చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు

‘Koffee With Karan -7’ చాట్ షోకీ రాబోతున్న సౌతిండియన్ సెలబ్రిటీస్

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ (karan johar) మే 4న కీలక ప్రకటన చేశాడు. తాను హోస్ట్ చేసే చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) 7వ సీజన్ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. గత ఆరు సీజన్స్‌లో ఎక్కువ మంది బాలీవుడ్ సెలబ్రిటీలే ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా ప్రసారం కానున్న సీజన్‌లో బాలీవుడ్‌తో పాటు సౌత్ సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్, సమంత, రష్మిక మందన్న, తారక్, రామ్ చరణ్ తదితరులు ఉన్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఈ షోను చేరువ చేయాలనే ప్రయత్నంలో వీరందరిని ఆహ్వానిస్తున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


అల్లు అర్జున్- ప్రభాస్:

అల్లు అర్జున్, ప్రభాస్ చాలా ఏళ్లుగా మంచి స్నేహితులు. ‘పుష్ప: ది రైజ్’, ‘బాహుబలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇండియా వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి ఓ ఎపిసోడ్‌లో పాల్గొనబోతున్నారని గుసగసలు వినిపిస్తున్నాయి.   


నయనతార-విఘ్నేశ్ శివన్: 

సెలబ్రిటీ లవర్స్ నయనతార- విఘ్నేశ్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ లవర్స్ షోలో పాల్గొంటే అత్యధిక మంది ప్రేక్షకులను ఆకర్షించవచ్చని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం భావిస్తోంది. నయన్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. అట్లీ దర్శకత్వంలో షారూఖ్ పక్కన ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ షోలో కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెబితే సినిమాకు ముందే కొంత మంది ప్రేక్షకులకు చేరువ కావొచ్చని ఆమె అనుకుంటుందట. మాములుగా నయన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఈ చాట్ షోలో ఆమె పాల్గొంటే విశేషమనే చెప్పుకోవాలి. 


రామ్ చరణ్- తారక్: 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లోనే అందరిని అమితంగా ఆకట్టుకున్నారు. ఇంటర్వ్యూల్లో వీరిద్దరి మధ్య బ్రొమాన్స్ అదిరిపోయింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో కలసి పాల్గొంటే ప్రేక్షకులకు మరెన్నో రహస్యాలు తెలుస్తాయనడంలో ఎటువంటి ఆశ్యర్యం లేదు. 


సమంత- రష్మిక మందన్న: 

అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో సమంతకు ఉత్తరాదిలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రష్మిక మందన్న ‘పుష్ప’లో శ్రీ వల్లీగా కనిపించి బాలీవుడ్‌లో ప్రేక్షకులకు చేరువైంది . ఆమె త్వరలోనే బీ టౌన్‌కి స్ట్రెయిట్ హిందీ మూవీతో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’ సినిమాలు చేస్తుంది. సమంత కూడా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయనుంది. సమంత, రష్మిక జోడీ చాట్ షోలో పాల్గొంటే సౌతిండియా నుంచి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంకు మంచి వ్యూస్ వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు...

Updated Date - 2022-05-05T23:00:45+05:30 IST