Shweta Tiwari: నా కూతురిని పెళ్లి చేసుకోవద్దన్నాను
ABN, First Publish Date - 2022-09-11T21:51:31+05:30
హిందీలో పలు సిరీయల్స్తో ఫేమ్ సంపాదించుకున్న నటి శ్వేత తివారీ (Shweta Tiwari). సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పలక్ తివారీ (Palak
హిందీలో పలు సిరీయల్స్తో ఫేమ్ సంపాదించుకున్న నటి శ్వేత తివారీ (Shweta Tiwari). సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పలక్ తివారీ (Palak Tiwari) కూతురు, రేయాన్ష్ (Reyansh) కుమారుడు ఉన్నారు. పలక్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. శ్వేత తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులకు వివరించింది.
శ్వేత తివారీ తన కుమార్తెతో పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతానని చెప్పింది. కూతురును వివాహం చేసుకోవద్దన్నాని తెలిపింది. ‘‘పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. నిజం చెప్పాలంటే నా కూతురిని కూడా వివాహనికి దూరంగా ఉండమన్నాను. అది ఆమె జీవితం. ఈ విధంగా చేయమని నేను బలవంతం చేయను. కానీ, ఇటువంటి విషయాలపై ఆమె ఆలోచించాలనుకుంటాను. ఒకవేళ సహజీవనం మొదలుపెట్టినంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు’’ శ్వేత తివారీ చెప్పింది. రాజా చౌదరీ (Raja Chaudhary) ని శ్వేత పెళ్లి చేసుకుంది. అనివార్య కారణాల వల్ల ఆ బంధం బీటలు వారింది. అభినవ్ కోహ్లీని రెండో వివాహం చేసుకున్నప్పటికి అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమెకు వివాహంపై సదభిప్రాయం లేకుండా అయిపోయింది. శ్వేత విడాకులపై గతంలోనే మాట్లాడింది. ‘‘పలక్కు అప్పుడు 12 ఏళ్లుంటాయి. రాజా చౌదరీ నాతో దారుణంగా ప్రవర్తించేవాడు. కొట్టేవాడు. పలక్ ముందే వేధించేవాడు. కానీ, పలక్కు అతడు మారుతాడని ఆశ ఉండేది. అతడు నాపై అనేక తప్పుడు ఆరోపణలు మోపాడు. అందువల్ల పలక్ను కలుసుకోవడానికి నేను రాజాకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతినివ్వను’’ అని శ్వేత తివారీ చెప్పింది.