Shatrughan Sinha: వారికి కాలం చెల్లినట్లే!
ABN , First Publish Date - 2022-10-03T17:57:38+05:30 IST
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ సినిమా వ్యాపారం వెన్నెముక విరిగిపోయింది. అప్పటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. స్టార్డమ్కు కాలం కూడా చెల్లినట్లే’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా అన్నారు.
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ సినిమా వ్యాపారం వెన్నెముక విరిగిపోయింది. అప్పటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. స్టార్డమ్కు కాలం కూడా చెల్లినట్లే’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha)అన్నారు. ఏ విషయం మీదైన ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో సినిమాల ఫెయిల్యూర్స్, బాయ్కాట్ ఇష్యూలపై ఆయన మాట్లాడారు. (Shatrughan Sinha Comments on bollywood)
‘‘కరోనా మహమ్మారి సినీ వ్యాపారం మొత్తాన్ని నాశనం చేసింది. ఈ మధ్యన బాయ్కాట్ ట్రెండ్ వల్ల చాలా సినిమాలు నష్టపోయాయి. దాని వల్ల స్టార్డమ్కు, స్టార్ హీరోలకు కాలం చెల్లినట్లు అయింది( stardom has ended). జీవితం కంటే ఈ స్టార్డమ్ గొప్పది కాదు. కరోనా అందరినీ సమానం చేసేసింది. ఇప్పుడంతా సాధారణ మనుషులే! ప్రస్తుతం కొత్తదనం ఉన్న చిత్రాలే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ మందికే స్టార్డమ్ హోదా అందుకుంటున్నారు. ఓ సినిమా వస్తే థియేటర్లో చూడాలా? ఓటీటీలో వచ్చాక చూద్దామా అన్న ఆలోచనలో ప్రేక్షకుడు ఉన్నాడు. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే... టికెట్ ధరలను తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వస్తున్న కథలతో ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే పరిస్థితి స్టార్లకు లేదు. అందుకే అందుకే గొప్ప వాళ్లం అనే భ్రమ నుంచి బయటపడ్డారు. స్టార్ల వ్యక్తిగత, పర్సనల్, సోషల్ ఇమేజ్ దెబ్బతిని వారి పరిస్థితిని దిగజార్చింది’ అని కామెంట్ చేశారు.
అలాగే తన కూతురు సోనాక్షి సిన్హా గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సోనాక్షి చాలా టాలెంటెడ్, కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయి. తన పని తాను చక్కగా చేసుకెళ్తుంది. తల్లి దగ్గర నుంచి అందాన్ని, నా నుంచి కాన్ఫిడెంట్ను పొందిందని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నా బిడ్డలకు 10 సంవత్సరాలు దాటినప్పటి నుంచీ వారి పనుల్లో నేను కలగజేసుకోవడం లేదు. పేరెంట్స్ పిల్లల వ్యక్తిత్వంపై దృష్టి పెట్టాలి కానీ వారి నిర్ణయాలను మనం శాసించకూడదని నేను అందరికీ చెబుతుంటా. అదే నేనూ పాటిస్తున్నా. పెళ్లి గురించి కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు శత్రుఘ్నసిన్హా.