Shakti Kapoor: ‘ఆ మూడు చెంప దెబ్బల వల్ల.. బాలీవుడ్నే వదిలేద్దామనుకున్నా’
ABN, First Publish Date - 2022-12-05T16:18:36+05:30
హిందీలోని పాపులర్ టీవీ షోలలో కపిల్ శర్మ హోస్ట్ చేసే ‘ది కపిల్ శర్మ షో’ (The Kapil Sharma Show) టాప్లో ఉంటుంది...
హిందీలోని పాపులర్ టీవీ షోలలో కపిల్ శర్మ హోస్ట్ చేసే ‘ది కపిల్ శర్మ షో’ (The Kapil Sharma Show) టాప్లో ఉంటుంది. ఈ షోకి ఎంతోమంది సెలబ్రీలను అతిథులుగా తీసుకొచ్చి వారి నుంచి ఎన్నో విషయాలను రాబడుతుంటాడు కపిల్. తాజాగా ‘లెజెండరీ కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అనే పేరుతో ఓ ప్రత్యేక ఎపిసోడ్ని కపిల్ నిర్వహించాడు. అందులో భాగంగా.. ఈ షోకి ప్రముఖ హాస్యనటులు శక్తి కపూర్ (Shakti Kapoor), అస్రానీ (Asrani, పెంటల్, టికు తల్సానియా అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ మాట్లాడుతూ బాలీవుడ్ వదిలేద్దామని అనుకున్న పరిస్థితుల గురించి తెలియజేశారు.
శక్తి కపూర్ మాట్లాడుతూ.. ‘నేను నా మొదటి కామెడీ చిత్రంగా పెంటల్తో కలిసి ‘సత్తె పే సత్తా’ని చేశాను. అది చాలా మంచి చిత్రం. అందులో నటించాలని ఓ కామెడీ పాత్ర కోసం రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మావాలి అనే సినిమా చేశాను. సినిమాలో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేలపై పడ్డాను. రెండో షాట్లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది’ అని చెప్పారు.
శక్తి ఇంకా మాట్లాడుతూ.. ‘దాంతో నా కెరీర్ ముగిసిపోయిందని నేను ఆందోళన చెందాను. కె.బాపయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ఖాదర్ ఖాన్తో కలిసి నటించాను. దాంతో.. ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. మీకు దండం పెడతా.. నాకు సాయంత్రం టిక్కెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. నేను ఈ చిత్రం చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇక పెళ్లి కూడా కాదని అన్నా. అయితే అదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ నా దగ్గరకి వచ్చాడు. ఈ చెంప దెబ్బ నీకు కావాల్సిన కీర్తిని ఇస్తుందని, కాబట్టి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లమని సలహా ఇచ్చాడు’ అని తెలిపారు.