నేను స్వార్థపరుడిలా బతికాను : ‘స్కామ్ 1992’ స్టార్
ABN , First Publish Date - 2022-01-19T16:04:46+05:30 IST
కొన్ని దశాబ్దాల క్రితం భారతీయ షేర్ మార్కెట్ని ఓ ఆట ఆడుకున్న వ్యక్తి హర్షద్ మెహతా. అతని బయోపిక్గా వచ్చిన వెబ్సిరీస్ ‘స్కామ్ 1992’.
కొన్ని దశాబ్దాల క్రితం భారతీయ షేర్ మార్కెట్ని ఓ ఆట ఆడుకున్న వ్యక్తి హర్షద్ మెహతా. అతని బయోపిక్గా వచ్చిన వెబ్సిరీస్ ‘స్కామ్ 1992’. హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది.
ఆ వెబ్సిరీస్తో మంచి పాపులారిటీ సాధించాడు ప్రతీక్ గాంధీ. అనంతరం వరుసగా ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఈ నటుడికి 2009లోనే నటి భామిని ఓజా గాంధీతో వివాహం అయ్యింది. కాగా, ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ప్రతీక్ మాట్లాడుతూ.. ‘ఇన్ని సంవత్సరాలుగా నేను చాలా బిజీగా ఉన్నాను. దీని గురించి నాకు, నా భార్య చాలా సార్లు వాదనలు జరిగాయి. నువ్వు దేని గురించి పరిగెడుతున్నావు. అదెప్పుడు సాధిస్తావు. మన కోసం సమయం ఎప్పుడు కుదురుతుందని అడుగుతూ ఉండేది. అది నిజమా. నేను చాలా స్వార్థపరుడిగా నా జీవితాన్ని గడిపానని నాకు తెలుస’ని తెలిపాడు.
అయితే ‘స్కామ్ 1992’ హిట్ కావడంతో ప్రతీక్ కష్టాలని తొలగిపోయాయి. ప్రస్తుతం ఈ నట దంపతులిద్దరూ వారి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, గతేడాది భవాయ్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన ఈ నటుడు.. ప్రస్తుతం విద్యాబాలన్, తాప్సీ పన్ను, రిచా చద్దా వంటి స్టార్స్తో పాజెక్ట్ చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు.