Sanjay Dutt: ‘షంషేరా’ను చూడకుండానే ఆసహ్యించుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-07-28T22:55:39+05:30 IST

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను పోషించే నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన నటించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). యశ్‌ రాజ్ ప్రొడక్షన్స్

Sanjay Dutt: ‘షంషేరా’ను చూడకుండానే ఆసహ్యించుకుంటున్నారు

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను పోషించే నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన నటించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). యశ్‌ రాజ్ ప్రొడక్షన్స్ రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. ప్రపంచవ్యాప్తంగా జులై 27న ఈ సినిమా విడుదలయ్యింది. సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో సంజుబాబా సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశాడు. సినిమాను చూడకుండానే అందరు బాగా లేదని చెబుతున్నారని పేర్కొన్నాడు. 


సినిమాలు అంకిత భావంతో చేస్తామని సంజయ్ దత్ తెలిపాడు. ‘‘మీరు ఎన్నడు చూడని కథను తెరపై చూపెట్టాలనుకున్నాం. అందు కోసమే కష్ట, నష్టాలను తట్టుకుని ‘షంషేరా’ ను నిర్మించాం. మా కలను తెర మీద ఆవిష్కరించాం. ప్రేక్షకులు చూడాలని ఆశించాం. ముందో, వెనుకో ప్రతి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. ప్రస్తుతం ‘షంషేరా’ ను అనేక మంది ఆసహ్యించుకుంటున్నారు. వారిలో కొంత మంది సినిమాను కూడా చూడలేదు. ఇది చాలా ఘోరం. మా కష్టాన్ని ఎవరు గౌరవించలేదు. ఫిల్మ్ మేకర్, వ్యక్తిగా కరణ్ మల్హోత్రా అంటే నాకు చాలా ఇష్టం. నేను నాలుగు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నేను చూసిన అత్యత్తమ దర్శకుడు కరణ్. మేమిద్దరం కలసి ‘అగ్నిపథ్’ లో నటించాం. అతడితో పనిచేయడం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల అతడు మరోసారి నన్ను నమ్మాడు. శుద్ధ్ సింగ్ పాత్రను నాకు ఇచ్చాడు. కరణ్ నాకు కుటుంబ సభ్యుడి లాంటివాడు. జయఅపజయాలతో సంబంధం లేకుండా అతడితో ఎల్లప్పుడు నేను పని చేయాలనకుంటాను. అతడికీ ఎల్లప్పుడు అండగా ఉంటాను. నాలుగేళ్ల పాటు శ్రమించి కరోనా లాంటి కష్టనష్టాలను ఎన్నింటినో ఎదుర్కొని ఈ చిత్రాన్ని రూపొందించాం. రణ్‌బీర్ కపూర్ అద్భుతంగా నటించాడు. తన పాత్రకు ప్రాణం పోశాడు. ప్రజలు చాలా తొందరగా మా పనిని ఆసహ్యించుకోవడం చాలా బాధేసింది’’ సంజయ్ దత్ వెల్లడించాడు.



Updated Date - 2022-07-28T22:55:39+05:30 IST