సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Riteish Deshmukh: జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-12-27T16:40:15+05:30

ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పారు. ఈ నటుడు ప్రస్తుతం ఆయన తాజాగా చిత్రం ‘వెడ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

Riteish Deshmukh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh) జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పారు. ఈ నటుడు ప్రస్తుతం ఆయన తాజాగా చిత్రం ‘వెడ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఈ నటుడి పీఆర్ టీమ్ తమతో అనుచితంగా ప్రవర్తించారని మీడియా ప్రతినిధులు తెలిపారు. ఆయన బౌన్సర్ ఒకరు నటుడిని కలవడానికి వచ్చిన తరుణంలో కోల్హాపూర్ హోటల్ బయటికి బలవంతంగా నెట్టేశారని చెప్పారు.

ఇటీవలే రితేశ్ తన భార్య జేనిలియాతో కలిసి మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా రితేశ్‌ని కలిసిన జర్నలిస్టులు పీఆర్ టీం ప్రవర్తన గురించి నటుడికి తెలియజేశారు. దాంతో రితేశ్ మాట్లాడుతూ.. ‘మేము అవమానించామని మీరు భావిస్తే మమ్మల్ని క్షమించండి. మేము ఎటువంటి మీటింగ్‌ని ఏర్పాటు చేయలేదు. మా పెళ్లై దాదాపు 11 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత తాజాగా అమ్మవారి దర్శనం కోసం వచ్చాం. అందుకే ఇక్కడ సినిమాల గురించి మాట్లాడాలని అనుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-12-27T16:40:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!