సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashmika Mandanna: తొలిసారిగా ఢిల్లీకి విచ్చేస్తున్న రష్మిక.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-07-23T00:22:51+05:30

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). అభిమానులందరూ ముద్దుగా ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా పిలుస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). అభిమానులందరూ ముద్దుగా ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా పిలుస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి కూడా తర్వలోనే ఎంట్రీ ఇస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, రష్మిక మొదటిసారిగా ఢిల్లీకి విచ్చేయనుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అందుకు కారణమేంటంటే..


రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తున్న సినిమా ‘యానిమల్’ (Animal). రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందుతోంది. పలు భాషల్లో విడుదల కానుంది. ‘యానిమల్’ చిత్రీకరణ కోసమే రష్మిక మొదటిసారిగా ఢిల్లీకి రానుంది. ‘‘సినిమా షూటింగ్, ఇతర పనుల నిమిత్తం రష్మిక మొదటిసారిగా ఢిల్లీకి రానుంది. ‘యానిమల్’ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సందర్భంగా నగరాన్ని సందర్శించడంతో పాటు అభిమానులను కలసుకోవాలనుకుంటుంది. జులై 26న ఢిల్లీకి వచ్చి కొన్ని రోజులు అక్కడే గడపనుంది’’ అని రష్మికతో సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రష్మిక మందన్న బాలీవుడ్‌లో ‘గుడ్ బై’ చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించాడు. భారీ క్రేజీ సినిమా ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. దళపతి విజయ్‌కు జోడీగా ‘వారసుడు’ లోను హీరోయిన్‌గా నటిస్తుంది.

Updated Date - 2022-07-23T00:22:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!