Nawazuddin Siddiqui భార్య Aaliya Siddiqui పై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-07-08T22:56:48+05:30 IST

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘సీరియస్ మెన్’ (Serious Men) సినిమాలో నటించి ప్రపంచ‌వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు.

Nawazuddin Siddiqui భార్య Aaliya Siddiqui పై కేసు నమోదు

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘సీరియస్ మెన్’ (Serious Men) సినిమాలో నటించి ప్రపంచ‌వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. ఎమ్మీ అవార్డ్‌(Emmy Award)కు కూడా నామినేట్ అయ్యాడు. తాజాగా నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య ఆలియా సిద్దిఖీ (Aaliya Siddiqui)కి వ్యతిరేకంగా పోలీసులు కేసును నమోదు చేశారు. ఆర్థిక మోసానికి పాల్పండిదనే ఆరోపణలను ఆమెపై మోపారు.  


ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హోలీ కౌ’ (Holy Cow) లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నవాజ్ భార్య ఆలియా సిద్దిఖీ నిర్మాతగా వ్యవహరిస్తుంది. మంజు గర్వాల్ అనే మహిళ నుంచి ఆలియా రూ. 31లక్షలను అప్పుగా తీసుకుని సినిమాపై పెట్టుబడి పెట్టింది. డబ్బులను తిరిగివ్వమని అడగగా ఆలియా సరిగ్గా స్పందించలేదు. ఫలితంగా మంజు జూన్ 20న అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మంజు గర్వాల్ మీడియతో మాట్లాడింది. ‘‘ఆలియాతో నాకు 2005 నుంచి పరిచయముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నిర్మాతగా మారాలని ఆమె కొంతకాలంగా ఎదురు చూస్తుంది. పరిస్థితులు అనుకూలించడంతో ‘హోలీ కౌ’కు నిర్మాతగా మారింది. ఈ సినిమా క్రియేటివ్ సైడ్ నన్ను చూసుకోమంది. ఆర్థిక విషయాలను ఆమె చూసుకుంటానంది. ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటుల విషయాలను నేను చూసుకున్నాను. కానీ, వారికీ చెల్లించాల్సిన చెక్స్ కొంతకాలానికే బౌన్స్ కావడం ప్రారంభమయ్యాయి. ఆలియాకు కొంచెం డబ్బులు అవసరం అవ్వడంతో మా నాన్నను అడిగింది. దీంతో మా నాన్న ఉజ్జయినిలోని ఇంటిని అమ్మి ఆమెకు డబ్బులను ఇచ్చారు. నెల రోజుల్లోనే తిరిగి ఇస్తానని ఆమె చెప్పింది. ఎన్నిసార్లు అడిగినప్పటికి ఆమె డబ్బులను తిరిగి ఇవ్వలేదు’’ అని మంజు గర్వాల్ చెప్పింది.

Updated Date - 2022-07-08T22:56:48+05:30 IST