Akshay Kumar ను మూర్ఖుడిగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా
ABN , First Publish Date - 2022-06-03T23:04:01+05:30 IST
శరవేగంగా సినిమాలు చేసే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒక్కో సినిమాను 30రోజుల నుంచి 40రోజుల్లోనే పూర్తి చేస్తుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’
శరవేగంగా సినిమాలు చేసే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒక్కో సినిమాను 30రోజుల నుంచి 40రోజుల్లోనే పూర్తి చేస్తుంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్గా నటించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో జూన్ 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో అక్షయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మన చరిత్ర పుస్తకాల్లో హిందూ రాజుల గురించి కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
హిందూ రాజులు, మొఘల్ చక్రవర్తుల మధ్య మన చరిత్ర పుస్తకాల్లో సమతూకం ఉండాలని అక్షయ్ కుమార్ తెలిపారు. ‘‘నాకు తెలిసినంత వరకు చరిత్ర పుస్తకాల్లో హిందూ రాజుల గురించి 3, 4లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమా చేయడం ద్వారా పృథ్వీరాజ్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. కొన్ని రోజుల క్రితమే నా కుమారుడితో పృథ్వీరాజ్ గురించి మాట్లాడాను. బ్రిటిష్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం గురించి నా కొడుకు తెలుసని చెప్పాడు. పృథ్వీరాజ్ ఎవరని ప్రశ్నించాడు. అందువల్ల విద్యా శాఖ ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని అక్షయ్ కుమార్ వెల్లడించారు. అక్షయ్ కుమార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారి వివాదస్పదం అయ్యాయి. చాలా మంది నెటిజన్స్ అక్కీ కామెంట్స్తో విభేదించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వీరికీ జత కలిశారు. అక్షయ్ కుమార్ను మూర్ఖుడిగా అభివర్ణించారు. ‘‘అక్షయ్ నీ తల్లిదండ్రుల మాటలు విని నువ్వు కొంచెం మాత్రమే చదువుకుని ఉంటావు. అందువల్లే ప్రజల్లో మూర్ఖుడిగా ఉండిపోయావు’’ అని పవన్ ఖేరా తెలిపారు. పవన్ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఫలితంగా ట్విట్టర్లో మరొక పోస్ట్ పెట్టారు. ‘‘నాకు సంబంధించినంత వరకు అక్షయ్ కుమార్, అక్బర్ ఈ దేశానికి చెందినవారే’’ అని పవన్ పేర్కొన్నారు.