Atal Bihari Vajpayee బయోపిక్‌లో Pankaj Tripathi..!

ABN , First Publish Date - 2022-07-08T22:02:52+05:30 IST

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ (Pankaj Tripathi). తన నటనతో అభిమానులను ఫిదా చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితమే ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం

Atal Bihari Vajpayee బయోపిక్‌లో Pankaj Tripathi..!

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ (Pankaj Tripathi). తన నటనతో అభిమానులను ఫిదా చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితమే ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్’ (International Indian Film Academy Awards)లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుపొందాడు. అతడు ‘లూడో’ (Ludo) లో  పోషించిన పాత్రకు గాను ఈ పురస్కారం దక్కింది. తాజాగా వెండితెర మీద ప్రతిష్ఠాత్మక నాయకుడి పాత్రను పోషించే అవకాశం పంకజ్ దక్కించుకున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.  


భారత్ మాజీ ప్రధాని, భారత రత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్రను వెండి తెర మీదకు తీసుకురాబోతున్నారు. ‘మె రహూ యా నా రహూ, యే దేశ్ రెహ్నా చాహియే - అటల్’ (Main Rahoon Ya Na Rahoon, Ye Desh Rehna Chahiye - Atal)టైటిల్‌తో ఈ బయోపిక్‌ను రూపొందించనున్నారు. ఎన్‌పీ. ఉల్లేఖ్ (NP Ullekh) రాసిన ‘ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటిషియన్ అండ్ పారడాక్స్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాను వినోద్ భానుశాలీ, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ఈ మూవీని 2023, డిసెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. పంకజ్ త్రిపాఠీ ప్రస్తుతం పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో కాళీన్ భయ్యాను పాత్రను అతడు పోషిస్తున్నాడు.  

Updated Date - 2022-07-08T22:02:52+05:30 IST