Nora Fatehi: జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా.. ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసిన అందాల భామ..

ABN , First Publish Date - 2022-12-15T20:29:12+05:30 IST

మనీ లాండరింగ్‌ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Nora Fatehi) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) తో సంబంధాలను నెరిపిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు.

Nora Fatehi: జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా.. ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసిన అందాల భామ..

మనీ లాండరింగ్‌ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Nora Fatehi) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) తో సంబంధాలను నెరిపిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో మరో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నోరా ఫతేహీ కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై పరువు నష్టం దావా వేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

ఇతరులను ఉపయోగించుకుని లబ్ధి పొందే రీతిలో తన తల్లిదండ్రులు తనను పెంచలేదని నోరా ఫతేహీ తెలిపింది. ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘ఇతరుల నుంచి లబ్ధి పొందేలా నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదు. ఎవరిని మోసం చేసే ఆలోచన నాకు ఎప్పుడు లేదు’’ అని నోరా చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జాక్వెలిన్, నోరాను పలు మార్లు ప్రశ్నించారు. ఫలితంగా నోరా పతేహీ డిసెంబర్ 12న జాక్వెలిన్‌, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కల్పించే విధంగా ప్రవరిస్తున్నారని ఆరోపించింది. అందువల్ల సినీ ఇండస్ట్రీలో తనకు పనిలేకుండా పోయిందని చెప్పింది. కానీ, జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. బహిరంగంగా నోరా ఫతేహీకీ వ్యతిరేకంగా తన క్లయింట్ ఎప్పుడు మాట్లాడలేదన్నారు. అటువంటప్పుడు ఆమె పరువుకు ఏ విధంగా భంగం కలిగిస్తుందని ప్రశ్నించారు.

Updated Date - 2022-12-15T20:29:14+05:30 IST